గృహనిర్మాణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొలుసు పార్థసారధి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 9:50 PM IST
Housing Minister Kolusu Parthasarathy Take Charge:గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా కొలుసు పార్థ సారధి సచివాలయంలోని ఐదో బ్లాక్లో బాధ్యతలు స్వీకరించారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీకి ధన్యవాదలు తెలిపారు. గృహనిర్మాణ, సమాచారశాఖ అప్పగించడం సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి, పూర్తయిన వాటికి చాలా అంతరం ఉందని తెలిపారు. కేంద్ర పథకాలు, అమృత్ పథకాలు, ఎన్ఆర్ఈజీఎస్ కింద గృహ నిర్మాణ శాఖకు నిధులు తెచ్చుకోగలమని పేర్కొన్నారు. వివిధ రకాల సమస్యలతో ఈ శాఖ కుంటుపడిందని, ఇకపై అన్ని అంశాలను సమీక్ష చేసి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు.