'15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి' - పీవీ సునీల్కుమార్కు ప్రభుత్వం ఉత్తర్వులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : 14 hours ago
Government Action on PV Sunil Kumar: సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్పై ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సునీల్ కుమార్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిర్ణయించింది. సీఐడీ అధికారులు కస్టడీలో తనపై దాడి చేశారని ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుతో నగరంపాలెం పీఎస్లో ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై 'ఎక్స్' వేదికగా సామాజిక మాధ్యమాల్లో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పోస్టు పెట్టారు. అఖిలభారత సర్వీసు 1969 నిబంధనల ప్రకారం ఇది మిస్ కండక్ట్గా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై 15 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా లేదా వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.