EENADU-ETV Organized Food Donation Programme :అక్షర కృషివలుడు రామోజీరావు మహాభినిష్క్రమణం చెంది 13 రోజులైన సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చిన రోగులు, వారి కుటుంబాలకు సుమారు 1000 మందికి అన్నసంతర్పణ చేశారు. ఈనాడు ఏజెంట్లు వీరారెడ్డి, రమేష్లు ఈ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రామోజీరావు రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
అక్షరయోధుడు రామోజీరావుకు నివాళి ఘటిస్తూ ఆసుపత్రిలో అన్నదానం
Published : Jun 21, 2024, 4:39 PM IST
EENADU-ETV Organized Food Donation Programme (ETV Bharat)
అక్షరయోధుడు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతోనే ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా నిర్వాహకులు వెల్లడించారు. ఈనాడు-ఈటీవీ ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందన్నారు. తెలుగు భాషకు రామోజీరావు చేసిన సేవలు విశేషమైనవని పేర్కొన్నారు.