Published : Aug 28, 2024, 10:39 AM IST
మరి కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు కవిత
BRS MLAC Kavitha CBI Charge Sheet News : దిల్లీ మద్యం పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వర్చువల్గా హాజరుకానున్నారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మద్యం కేసులో సీబీఐ ఛార్జ్షీట్పై విచారణ జరగనుంది. ప్రస్తుతం ఆమె దిల్లీలోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. తనను కలిసేందుకు వచ్చిన పార్టీ నేతలతో ఆమె కలవనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు దిల్లీ నుంచి ఆమె హైదరాబాద్కు రానున్నారు. ఆమెతో పాటు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్ రావు బీఆర్ఎస్ నేతలు కూడా హైదరాబాద్కు రానున్నారు.