Boy Died in Dogs Attack at Hyderabad : వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మక్తాలో చోటుచేసుకుంది. మృతుడు సాత్విక్ (6) మియాపూర్లో భిక్షాటన చేస్తున్న కుటుంబానికి చెందినవాడు. మంగళవారం రాత్రి ఆడుకోవటానికి ఇంటి నుంచి బయటకు వెళ్లి, కనబడకుండా పోయాడని కుటుంబ సభ్యులు వాపోయారు.
కుక్కల దాడిలో 6 ఏళ్ల బాలుడి మృతి - నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహం
Published : Jun 5, 2024, 10:39 AM IST
Boy Died in Dogs Attack (ETV Bharat)
బాలుడి కోసం గాలించగా ఆచూకీ ఎక్కడా కనిపించలేదు. చివరకు ఈరోజు (జూన్ 5) ఉదయం మక్తాలోని నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు, బాలుడి శరీరంపై కుక్కలు దాడి చేసిన కాట్లను గుర్తించారు. వారు నివసిస్తున్న ప్రదేశం డంపింగ్ యార్డ్ కావడంతో అక్కడ అధికంగా కుక్కలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.