కంటైనర్లో 800 కిలోల గంజాయి స్మగ్లింగ్ - గోల్కొండ వద్ద సీజ్ చేసిన అధికారులు
Published : Aug 4, 2024, 11:30 AM IST
Police Seize Ganja in Hyderabad :హైదరాబాద్లోని పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రింగ్ రోడ్డుపై పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్పేట్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కంటైనర్లో సుమారు 800 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్వోటీ పోలీసులు సీజ్ చేశారు. దీన్ని ఒడిశా నుంచి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.