Paris Olympics 2024 : ముగిసిన పీవీ సింధు పోరాటం - ఒలింపిక్స్ నుంచి ఔట్
Published : Aug 1, 2024, 11:17 PM IST
|Updated : Aug 1, 2024, 11:30 PM IST
ParisOlympics PVSindhu : ఒలింపిక్స్లో మూడో పతకంపై కన్నేసిన స్టార్ షట్లర్ పీవీసింధుకు నిరాశ ఎదురైంది. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్లో గ్రూప్స్టేజ్లో వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన సింధుకు ఇప్పుడు ప్రీ క్వార్టర్స్లో పరాజయం ఎదురవ్వడంతో.ఆమె పోరాటం ముగిసింది. రియో ఒలింపిక్స్ 2016లో రజతం, టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్యం గెలిచిన సింధు - ఇప్పుడు పారిస్లో మాత్రం ప్రీక్వార్టర్స్కే పరిమితమైంది. చైనాకు చెందిన 9వ ర్యాంకర్ హీబింగ్ జియావోపై 19-21,14-21వరుస సెట్లలో ఓడింది. వాస్తవానికి ఈ పోరులో సింధుఅనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. తొలిగేమ్లో క్రాస్ కోర్ట్ షాట్స్తో సింధు, స్మాష్లతో చైనా ప్లేయర్ హోరాహోరీగా తలపడ్డారు. చివరకు చైనా ప్లేయర్ గెలిచింది. ఇక రెండోగేమ్ ఆరంభం నుంచే దూకుడు చూపించిన బింగ్ వరుస పాయింట్స్తో సింధుపై ఒత్తిడిని పెంచింది. కానీ మధ్యలో సింధు కాస్త పుంజుకున్నా చివరికి ఆధిక్యాన్ని కాపాడుకొని రెండో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతంచేసుకుంది బింగ్.