జగన్ తన రాజ్యం లాక్కున్నట్లు బాధ పడుతున్నాడు : ఎమ్మెల్యే ధూళిపాళ్ల
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 3:25 PM IST
![జగన్ తన రాజ్యం లాక్కున్నట్లు బాధ పడుతున్నాడు : ఎమ్మెల్యే ధూళిపాళ్ల MLA_Dhulipala_Narendra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-06-2024/1200-675-21761988-thumbnail-16x9-mla-dhulipala-narendra.jpg)
MLA Dhulipala Narendra Chit Chat:అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో ముచ్చటించారు. ఓడిపోయిన తర్వాత జగన్ ఎలా ఉన్నాడో చూడాలని తమ వాళ్లంతా ఎదురు చూశారని అన్నారు. జగన్ తన రాజ్యం లాక్కున్నట్లు ఫీల్ అయినట్లు అనిపించిందని వ్యాఖ్యానించారు. ప్రమాణ స్వీకార సమయంలో జగన్ మాటలు తడబడి పేరు కూడా తప్పుగా చదివారన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీటులో కూర్చోకుండా ఇంత వరకూ ఏ ఎమ్మెల్యే వెళ్లిపోలేదని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.