national

రాజధాని నిర్మాణానికి మంత్రి రాంప్రసాద్​రెడ్డి విరాళం - సీఎంకు చెక్కు అందజేత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 7:29 PM IST

rtc_minister_donation_for_capital
rtc_minister_donation_for_capital (ETV Bharat)

Minister Ramprasad Reddy Donation for Construction of Amaravati :రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. తన మొదటి నెల వేతనం మొత్తం రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రూ.3,01,116ను చెక్కు రూపంలో అందజేశారు. ఈ చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి సచివాలయంలో కలసి అందజేశారు. జగన్ హయాంలో అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతి పూర్తవ్వాలంటే అది కూటమి ప్రభుత్వంలోనే అవుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details