ETV Bharat / state

చైనాలో ఏపీ, తమిళనాడు MBBS విద్యార్థులకు జైలుశిక్ష - న్యాయం జరిగేలా చూస్తానని కేంద్రమంత్రి హామీ - MBBS Students Arrested in China

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 3:48 PM IST

AP Students Arrested in China: చైనాలో జైలు శిక్ష అనుభవిస్తున్న తమ కుమారులను కాపాడాలంటూ బాధిత తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 18 నెలలుగా జైల్లోనే ఉన్నారని, అత్యాచారం చేసినట్లు వారిపై తప్పుడు కేసు బనాయించారని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు వినతిపత్రం అందజేశారు. వివరాలన్నీ తెలుసుకున్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Central Minister on MBBS Students Arrest
Central Minister on MBBS Students Arrest (ETV Bharat)

AP Students Arrested in China: చైనాలో జైలు శిక్ష అనుభవిస్తోన్న తమ కుమారుల నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు బెయిల్‌ మంజూరు చేయించాలంటూ తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను ఆంధ్రప్రదేశ్​కి చెందిన ఓ విద్యార్థి తండ్రి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబ సభ్యులు కలిశారు.

చైనాలోని జియాన్ సిటీలో MBBS చేసిన విద్యార్థులు ఇంటర్న్ షిప్ కోసం సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో అత్యాచారం చేశారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాది మార్చి 31న వారిని అరెస్టు చేశారు. కోర్టులో విచారణ తర్వాత ఏపీ విద్యార్థికి 11 ఏళ్లు, తమిళనాడు విద్యార్థులు ఒక్కరికి పదిన్నర సంవత్సరాలు, మరొకరికి 10 ఏళ్ల శిక్ష విధించారు.

అరెస్టు జరిగిన నెల వరకు విద్యార్థుల నుంచి ఫోన్లు రాక తల్లిదండ్రులు కంగారుపడ్డారు. చివరికి ఓ విద్యార్థి తల్లి మీనాక్షి వైద్య కళాశాల వారిని సంప్రదించగా క్రిమినల్‌ కేసులో అరెస్టు అయినట్లు మాత్రమే చెప్పారు. వెంటనే చైనా వెళ్లి జైలు వద్దకు వెళ్లగా విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా రావాలని పంపించివేశారు. వీరు గత ఏడాది నుంచి కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలను కలుసుకుంటూ వస్తున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘాన్నీ ఆశ్రయించారు. ఈ క్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, అగ్రనేతల చొరవతో వీరు ఈ ఏడాది మేలో చైనా దేశానికి వెళ్లి, జైల్లో ఉన్న వైద్య విద్యార్థులను కలుసుకున్నారు.

25 లక్షలు డిమాండ్ చేసిన సదరు మహిళ, డబ్బులు ఇవ్వకపోవడంతో తప్పుడు కేసు పెట్టిందని బాధిత విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులు తెలుసుకున్నారు. అత్యాచారం చేసినట్లు ఒప్పుకోకపోతే కాల్చివేస్తామని పోలీసులు బెదిరించడం వల్లే నేరం అంగీకరించినట్లు పిల్లలు చెప్పారని పేర్కొన్నారు. లాయర్ ఫీజుల పేరిట 30 లక్షలు వసూలు చేసిన ఓ సీనియర్ విద్యార్థి, ఆ సొమ్ములు మింగేశాడు. ఈ వివరాలన్నీ తెలుసుకున్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

కాగా జైళ్లల్లో ఉన్న నేరస్థులను బెయిల్‌పై విడిపించాలంటే భారత ప్రభుత్వం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా దేశాలకు చెందిన ‘బ్రిక్స్‌’ను సంప్రదించాలి. అప్పుడే ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసేందుకు వీలవుతుంది. ఈ సంస్థ ద్వారా వ్యాపార, రాజకీయ అంశాలపై ఆయా దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. బాధిత తల్లిదండ్రులు వారికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. అరెస్టులు అక్రమంగా జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టిందని, బాధితులకు న్యాయం జరిగేలా చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పెద్దపీట- 'విశాఖ ఉక్కు'ను కాపాడుకుంటాం : కేంద్రమంత్రి భూపతిరాజు - Union Minister Bhupathiraju

AP Students Arrested in China: చైనాలో జైలు శిక్ష అనుభవిస్తోన్న తమ కుమారుల నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు బెయిల్‌ మంజూరు చేయించాలంటూ తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను ఆంధ్రప్రదేశ్​కి చెందిన ఓ విద్యార్థి తండ్రి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబ సభ్యులు కలిశారు.

చైనాలోని జియాన్ సిటీలో MBBS చేసిన విద్యార్థులు ఇంటర్న్ షిప్ కోసం సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో అత్యాచారం చేశారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాది మార్చి 31న వారిని అరెస్టు చేశారు. కోర్టులో విచారణ తర్వాత ఏపీ విద్యార్థికి 11 ఏళ్లు, తమిళనాడు విద్యార్థులు ఒక్కరికి పదిన్నర సంవత్సరాలు, మరొకరికి 10 ఏళ్ల శిక్ష విధించారు.

అరెస్టు జరిగిన నెల వరకు విద్యార్థుల నుంచి ఫోన్లు రాక తల్లిదండ్రులు కంగారుపడ్డారు. చివరికి ఓ విద్యార్థి తల్లి మీనాక్షి వైద్య కళాశాల వారిని సంప్రదించగా క్రిమినల్‌ కేసులో అరెస్టు అయినట్లు మాత్రమే చెప్పారు. వెంటనే చైనా వెళ్లి జైలు వద్దకు వెళ్లగా విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా రావాలని పంపించివేశారు. వీరు గత ఏడాది నుంచి కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలను కలుసుకుంటూ వస్తున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘాన్నీ ఆశ్రయించారు. ఈ క్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, అగ్రనేతల చొరవతో వీరు ఈ ఏడాది మేలో చైనా దేశానికి వెళ్లి, జైల్లో ఉన్న వైద్య విద్యార్థులను కలుసుకున్నారు.

25 లక్షలు డిమాండ్ చేసిన సదరు మహిళ, డబ్బులు ఇవ్వకపోవడంతో తప్పుడు కేసు పెట్టిందని బాధిత విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులు తెలుసుకున్నారు. అత్యాచారం చేసినట్లు ఒప్పుకోకపోతే కాల్చివేస్తామని పోలీసులు బెదిరించడం వల్లే నేరం అంగీకరించినట్లు పిల్లలు చెప్పారని పేర్కొన్నారు. లాయర్ ఫీజుల పేరిట 30 లక్షలు వసూలు చేసిన ఓ సీనియర్ విద్యార్థి, ఆ సొమ్ములు మింగేశాడు. ఈ వివరాలన్నీ తెలుసుకున్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

కాగా జైళ్లల్లో ఉన్న నేరస్థులను బెయిల్‌పై విడిపించాలంటే భారత ప్రభుత్వం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా దేశాలకు చెందిన ‘బ్రిక్స్‌’ను సంప్రదించాలి. అప్పుడే ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసేందుకు వీలవుతుంది. ఈ సంస్థ ద్వారా వ్యాపార, రాజకీయ అంశాలపై ఆయా దేశాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. బాధిత తల్లిదండ్రులు వారికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. అరెస్టులు అక్రమంగా జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టిందని, బాధితులకు న్యాయం జరిగేలా చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పెద్దపీట- 'విశాఖ ఉక్కు'ను కాపాడుకుంటాం : కేంద్రమంత్రి భూపతిరాజు - Union Minister Bhupathiraju

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.