national

రుణమాఫీపై సమస్యలుంటే కలెక్టర్లను కలవండి - రైతులకు సీఎం రేవంత్ సూచన

By ETV Bharat Telangana Team

Published : Aug 22, 2024, 3:08 PM IST

CM REVANTH ON BRS GOVERNMENT
CM Revanth Reddy on KTR (ETV Bharat)

CM Revanth Reddy Slams KTR :రుణమాఫీపై సమస్యలు ఉంటే కలెక్టర్లు, వ్యవసాయాధికారులను కలవండని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి రైతులకు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. రుణమాఫీపై కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రైతులు అధికారుల వెంబడి కాకుండా కాంగ్రెస్ నేతల వెంటపడాలన్న కేటీఆర్​ వ్యాఖ్యలను సీఎం రేవంత్​ తిప్పికొట్టారు. ఫాంహౌస్‌లో తప్ప ఎక్కడైనా కేసీఆర్‌ కనిపించేవారా అని ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఇచ్చిందెంతో 10 నెలల్లో తాము ఇచ్చిందెంతో చర్చకు రండని సవాల్ విసిరారు. పది నెలలు కాకముందే తమపై విమర్శలు చేయడమే బీఆర్‌ఎస్‌ పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details