CM Revanth Attended Dinner At Pocharam Home :కాంగ్రెస్లో ఇటీవలే చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తన నివాసంలో విందు సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి సహా ఇటీవల కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ కండువా కప్పుకొన్న 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 9మంది మాత్రమే ఈ భేటీకి హాజరైనట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
పోచారం ఇంట్లో పొలిటికల్ డిన్నర్ - హాజరైన సీఎం రేవంత్
Published : Aug 1, 2024, 8:22 AM IST
Dinner Meet At Pocharam Home (ETV Bharat)
గద్వాల్ ఎమ్మెల్యే బి.కృష్ణమోహన్ రెడ్డి హాజరుకాలేదని పేర్కొన్నాయి. ఇటీవల కాంగ్రెస్లో చేరిన కృష్ణమోహన్రెడ్డి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎల్పీ నేత ఛాంబర్కు వెళ్లి ఆ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్రావులను కలిశారు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్ను కూడా కలువనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి చెప్పారు.