తెలంగాణ

telangana

ETV Bharat / snippets

స్కూల్​ బస్సు బోల్తా పడి చెలరేగిన మంటలు- 12మంది విద్యార్థులు సజీవదహనం

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 7:13 AM IST

South Africa School Bus Accident
South Africa School Bus Accident (ETV Bharat)

South Africa School Bus Accident : దక్షిణాఫ్రికాలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి, మంటలు అంటుకోవడం వల్ల 12మంది విద్యార్థులతో పాటు డ్రైవర్​ సజీవ దహనమయ్యాడు. మరో ఏడుగురు పిల్లలు గాయపడ్డారు. గౌటెంగ్‌ ప్రావిన్సులోని మోరాఫంగ్​ పట్టణంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. సెలవుల అనంతరం బడులను తెరచిన ఒకరోజు వ్యవధిలోనే ఈ ఘోరం జరగడం వల్ల విషాదం నెలకొంది. గాయపడిన ఏడుగురు చిన్నారుల్ని ఆసుపత్రిలో చేర్చారు. బస్సును ఓ చిన్న ట్రక్కు వెనుక నుంచి ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విద్య, రవాణా శాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న క్షతగాత్రులను పరామర్శించారు. కాగా, దక్షిణాఫ్రిలో అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్స్​ గౌటెంగ్​. ఇక్కడ పాఠశాలకు వెళ్లేందుకు వేల మంది విద్యార్థులు ప్రైవేటు మినీ బస్సులను ఆశ్రయిస్తారు.

ABOUT THE AUTHOR

...view details