తెలంగాణ

telangana

కుప్పకూలిన పాఠశాల భవనం - 22మంది విద్యార్థులు మృతి

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 8:07 PM IST

School Collapse In Nigeria
School Collapse In Nigeria (Associated Press)

School Collapse In Nigeria: పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాలో శనివారం పెను విషాదం జరిగింది. ప్లాట్యూ రాష్ట్రంలోని జోస్‌ నగరంలో ఓ రెండంతస్తుల పాఠశాల భవనం కూలడం వల్ల 22మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది , పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. శిథిలాలు తొలగించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పాఠశాలలో తరగతులు ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రమాదం జరిగినట్లు సమాచారం. నది ఒడ్డుకు సమీపంలో ఉన్న ప్రదేశంలో పాఠశాల నిర్మాణం జరగడం, అది బలహీనంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details