నటి శిల్పా శెట్టిపై చీటింగ్ కేసు నమోదు! : పోలీసులకు కోర్టు ఆదేశం
Published : Jun 14, 2024, 7:47 AM IST
Bollywood Actress Shilpa Shetty Cheating Case : బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా సహా మరికొందరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ముంబయి కోర్టు ఆదేశించింది. గోల్డ్ స్కీమ్తో(బోగస్ బంగారం పథకం) తనను మోసగించారని ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదుపై ముంబయి అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్పి మెహతా పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కేసులో పూర్తి విచారణ జరపాలని పేర్కొన్నారు. కాగా, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలు సహా వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, దాని ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఉద్యోగి కలిసి తనను మోసం చేశారని రిద్ధి సిద్ధి బులియన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కొఠారీ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీంతో వీరు మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జి కూడా ధ్రువీకరించారు. పూర్థి స్థాయిలో దర్యాప్తు చేయాలని బీకేసీ పోలీస్ స్టేషన్ను అదేశించారు.