Gujarat Road Accident :గుజరాత్లోని అహ్మదాబాద్- వడోదర ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఎక్స్ప్రెస్వేపై ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆనంద్ పట్టణ సమీపంలోని ఛిఖోడరా గ్రామంలో జరిగింది.
లగ్జరీ బస్సును ఢీకొన్న ట్రక్కు- ఆరుగురు మృతి- మరో 8మంది!
Published : Jul 15, 2024, 10:12 AM IST
|Updated : Jul 15, 2024, 10:23 AM IST
gujarat road accident (ANI)
అహ్మాదాబాద్ వైపు వెళ్తున్న ఓ లగ్జరీ బస్సు టైర్ పేలిపోవడం వల్ల రోడ్డు పక్కకు ఆపి మారుస్తున్నారు. ఈక్రమంలోనే వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టినట్లు ఆనంద్ ఎస్పీ గౌరవ్ జసానీ వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం పంపించారు.
Last Updated : Jul 15, 2024, 10:23 AM IST