national

లగ్జరీ బస్సును ఢీకొన్న ట్రక్కు- ఆరుగురు మృతి- మరో 8మంది!

By ETV Bharat Telugu Team

Published : Jul 15, 2024, 10:12 AM IST

Updated : Jul 15, 2024, 10:23 AM IST

gujarat road accident
gujarat road accident (ANI)

Gujarat Road Accident :గుజరాత్​లోని అహ్మదాబాద్​- వడోదర ఎక్స్​ప్రెస్​ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఎక్స్​ప్రెస్​వేపై ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆనంద్​ పట్టణ సమీపంలోని ఛిఖోడరా గ్రామంలో జరిగింది.

అహ్మాదాబాద్​ వైపు వెళ్తున్న ఓ లగ్జరీ బస్సు టైర్​ పేలిపోవడం వల్ల రోడ్డు పక్కకు ఆపి మారుస్తున్నారు. ఈక్రమంలోనే వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టినట్లు ఆనంద్​ ఎస్​పీ గౌరవ్​ జసానీ వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం పంపించారు.

Last Updated : Jul 15, 2024, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details