national

ETV Bharat / snippets

రెండంతస్తుల భవనంలో మంటలు- ఏడుగురు మృతి

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

Fire Accident In Mumbai
Fire Accident In Mumbai (ETV Bharat)

Fire Accident In Mumbai :ముంబయి చెంబూరులోని సిద్ధార్థ నగర్​ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. అందులో ఒకే ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన మరో ఐదుగురు ఉన్నారని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపింది. బీఎంసీ తెలిపిన వివరాల ప్రకారం, కాలనీలోని ఓ రెండంతస్తుల భవనం గ్రౌండ్​ ఫ్లోర్​లో ఉన్న షాప్​లో తెల్లవారుజామున 5.20 గంటలకు మంటలు చెలరేగాయి. వైరింగ్​ కనెక్షన్లు ఉండటం వల్ల మంటలు పై పోర్షన్​కు వ్యాపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఏడుగురు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. షాప్​లో షార్ట్​ సర్క్యూట్ జరగడం వల్లే మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు.

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details