పీఓకేలో అదుపు తప్పి లోయలో పడ్డ జీపు - ఆరుగురు చిన్నారులు సహా 14 మంది మృతి!
Published : Jul 10, 2024, 8:22 PM IST
14 Died In Jeep Accident In PoK : పాక్ ఆక్రమిత కశ్మీర్లో హిమాలయ పర్వత రహదారి గుండా ప్రయాణిస్తున్న జీప్ అదుపు తప్పి నీలం లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 14 మంది మృతి చెందగా, ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరణించినవారిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పాక్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని స్థానిక ప్రజల సాయంతో, ఆస్పత్రికి తరలించామని సామాజిక కార్యకర్త మీర్ అతీక్ తెలిపారు. గత నెలలో ఇదే జిల్లాలో ఓ వ్యాన్ నదిలో పడి 16 మంది మృతి చెందారు. పీఓకేలో రోడ్లు అధ్వానంగా ఉండటంతో పాటు, ట్రాఫిక్ చట్టాల అమలు, భద్రతా ప్రమాణాలు సరిగా లేకపోవడం వల్లనే తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.