Bihar Accident:బీహార్లోని వైశాలిలో కావడి యాత్రలో ఘోర ప్రమాదం జరిగింది. కావడి యాత్ర భక్తులు ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హైటెన్షన్ వైర్ తగిలి 9మంది మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒక మైనర్ ఉన్నారు.
కావడి యాత్రలో విషాదం- కరెంట్ షాక్తో 9మంది భక్తులు మృతి
Published : Aug 5, 2024, 7:06 AM IST
Etv Bharat (Etv Bharat)
ఈ ఘటన వైశాలిలోని హాజీపూర్ ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 'కన్వర్ యాత్రికులు డీజే ట్రాలీలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీలో డీజే సెటప్ చాలా ఎత్తుగా ఉండడం వల్ల హై టెన్షన్ తగిలింది. ఈ ప్రమాదంలో 9మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు' అని హజీపుర్ SDPO ఓం ప్రకాశ్ తెలిపారు. కాగా, వైశాలి జిల్లాకు చెందిన కొందరు యువకులు డీజే ట్రాలీలో సరన్లోని పహెల్జా ఘాట్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.