ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా నామినేషన్ అనంతరం బహిరంగ సభ - కడప నుంచి ప్రత్యక్ష ప్రసారం - YS Sharmila Rally Nomination LIve - YS SHARMILA RALLY NOMINATION LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 11:32 AM IST

Updated : Apr 20, 2024, 12:25 PM IST

YS Sharmila Nomination Rally LIve :రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు నామినేషన్ల ప్రక్రియ కోలాహలం కొనసాగుతోంది. అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ర్యాలీగా తరలివచ్చి నామపత్రాలు సమర్పిస్తున్నారు. అభ్యర్థులు ర్యాలీలు, బల ప్రదర్శనతో నామినేషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.నేడు ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థీ వైఎస్ షర్మిలా రెడ్డి ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలతో ఆమె తండ్రకి నివాళులు అర్పించారు. కడపలోని ఐటీఐ సర్కిల్ నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీగా బయలుదేరుతున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం  బహిరంగ సభలో ప్రసగిస్తారు.వైఎస్సార్ వైఎస్ షర్మిలా రెడ్డి నామినేషన్ ర్యాలీ ప్రత్యక్ష ప్రసారం - మీ కోసంNomination For AP Elections: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో జరుగనున్న ఏపీ శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరుగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏప్రిల్ 25 తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువుగా ఈసీ ప్రకటించింది. 26వ తేదీన నామినేషన్లు పరిశీలన చేయనున్నారు. అలాగే 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా పేర్కొన్నారు.
Last Updated : Apr 20, 2024, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details