ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మోహినీ అలంకారంలో కోదండరాముడు- పురవీధుల్లో వైభవంగా స్వామివారి ఊరేగింపు - Vontimitta Brahmotsavam

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 2:09 PM IST

Vontimitta Kodanda Rama Brahmotsavam in Fifth Day: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో జరుగుతున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మోహినీ అలంకారంలో రాములవారు జగన్మోహనిగా దర్శనమిచ్చారు. ఉదయం 7.30 గంటలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. రాములవారిని పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలు, కదళీ ఫలాలతో సుందరంగా అలంకరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కళాకారుల కోలాటం, కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్క భజనలు, డప్పు వాయిద్యాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. 

భక్తులు అడుగడుగునా పుష్పాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మోహినీ అవతార వృత్తాంతం గురించి భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం ఏర్పడుతుంది. ఆ కలహాన్ని నివారించి, దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంలో సాక్షాత్కరిస్తాడు. తనకు భక్తులు కానీవారు ఆ మోహిని మాయలో ఉంటారనీ రాములవారు అంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు తదితర టీటీడీ అధికారులు పాల్గొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details