ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమానుషం - మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్థులు - నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న సీఐ - Villagers Attack On Women

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 12:28 PM IST

Updated : Jul 25, 2024, 4:44 PM IST

villagers_attack_on_women_in_annamayya_district (ETV Bharat)

Villagers Attack On Women In Annamayya District : అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం షికారుపాలెంలో అమానుష ఘటన జరిగింది. మహిళను గ్రామస్థులు చెట్టుకు కట్టేసి కొట్టారు. గ్రామానికి చెందిన కొండమ్మ అలియాస్‌ చిన్ని ఇటీవల భర్త నుంచి విడిపోయి మరొకరిని వివాహం చేసుకుంది. అయితే కొండమ్మ తప్పు చేసిందని, అందుకే శిక్ష విధించేందుకే దాడికి పాల్పడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. వీడియోలు, ఫొటోలు బయటికి వెల్లడిస్తే మీ పైనే కేసు పెడతామని బాధితురాలిని బెదిరించారని ఆమె తరపు బంధువులు చెబుతున్నారు. సంఘటన వెనక గ్రామానికి చెందిన వైఎస్సార్​సీపీ నాయకుడి హస్తముందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాడి తర్వాత రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో కొండమ్మకు చికిత్స అందించారు.

సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల పరామర్శించారు. రాయచోటి గ్రామం సీఐ తులసీరామ్ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని దాడికి పాల్పడిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకోనున్నామనిపేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.  

Last Updated : Jul 25, 2024, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details