ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీలోకి తుంగభద్రమ్మ - సంతోషంలో రైతులు - Tungabhadra Water Enter in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 12:37 PM IST

Tungabhadra Water Enter in AP (ETV Bharat)

Tungabhadra Water Enter in AP : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి నాలుగు రోజుల క్రితం దిగువకు విడుదల చేసిన వరద నీరు ఈరోజు ఏపీ సరిహద్దులోకి ప్రవేశించింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేలిగనూరు వద్ద ఇవి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మధ్యాహ్ననికి నీరు ఆర్డీఎస్ చేరుకుని, సాయంత్రానికి మంత్రాలయం చేరుకునే అవకాశం ఉంది. జలాశయం నుంచి ఏడాది తర్వాత నీటిని విడుదల చేయడంతో నది పరివాహక గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు తాగు, సాగునీటికి ఇబ్బందులు తప్పాయని అంటున్నారు.

Water Release From Tungabhadra : మరోవైపు తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని డ్యాం బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో జలాశయానికి  75,810 క్యూసెక్కుల  వరద నీరు వచ్చి చేరిందని తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 1631.91 అడుగులకు గాను 101.42 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉందని వివరించారు. పలు కాల్వలకు 23,469 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details