ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ పాలకుల నిర్లక్ష్యం - రోగమొస్తే గిరిజనులకు డోలి మోతలే - Tribals Carried Pregnant on Doli

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 12:41 PM IST

Tribals Carried Pregnant Woman on Doli: గత పాలకుల నిర్లక్ష్యంతో కనీసం ఉపాధి హామీ రోడ్లు కూడా వేయలేని పరిస్థితి. దీంతో గిరిజన ప్రాంతాల్లో డోలి మోతలు తప్పడం లేదు. అల్లూరి జిల్లాలో రహదారి సౌకర్యం లేక పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని డోలిపై 3కిలోమీటర్లు మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. 

వివరాలివి: పాడేరు మండలం డి.సంపాలు గ్రామానికి చెందిన చిన్నతల్లి పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్​కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అయితే గ్రామంలో సరైన రహదారి లేకపోవటంతో దొడ్డిపల్లి గ్రామం వద్ద అంబులెన్స్ నిలిచిపోయింది. దీంతో స్థానికుల సహకారంతో కుటుంబ సభ్యులు గర్భిణిని 3 కిలోమీటర్లు దిగువన ఉన్న దొడ్డిపల్లికి డోలీలో తీసుకెళ్లారు. అక్కడ నుంచి అంబులెన్స్​లో పాడేరు ఆస్పత్రికి తరలించారు.

Tribals Problems Due to Lack of Roads: మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మన్యంలో మారుమూల గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో స్థానిక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనారోగ్యానికి గురైనా ఆస్పత్రికి చేరుకోవాలంటే సాహసం చేసి డోలి మోతతో రెండు వాగులు దాటించాల్సిన పరిస్థితి. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ దొర గూడ గ్రామానికి చెందిన వంతాల ప్రతిమ(46) గత మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత తగ్గుముఖం పట్టకపోవడం పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సాహసం చేసి ప్రమాదపు అంచులో రెండు వాగులు దాటించి ఆస్పత్రికి తరలించారు. రహదారి సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా లాభం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా గ్రామానికి రహదారి నిర్మించి ఆదుకోవాలని కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details