వాసుదేవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఐడీకి లేఖ రాసిన టీడీపీ నేత వర్ల - Varla Ramaiah write letter to CID
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 10:25 PM IST
Varla Ramaiah Write Letter to CID : రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులకు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి, అనంతపురం జిల్లా విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారిగా ఉన్న మునిరామయ్య అనే పోలీస్ అధికారి విచారణ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకోవాలని సీఐడీకి రాసిన లేఖలో తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డారని గతంలో వాసుదేవరెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చిన మునిరామయ్యను వైసీపీ ప్రభుత్వం వేధించిందని వివరించారు.
illegal liquor case on Vasudeva Reddy : అతనికి జీతభత్యాలు లేకుండా వీఆర్లో ఉంచి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని వర్ల రామయ్య నిప్పులు చెరిగారు. అవినీతి అధికారులను శిక్షించకపోగా, వారిపై విచారణ చేసిన పోలీసు అధికారులను శిక్షించడం ఏంటని? గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం, తాడిపత్రి, అనంతపురంలో వాక్ ఇన్ లిక్కర్ షాపులలో అవినీతికి పాల్పడ్డ వాసుదేవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.