By ETV Bharat Andhra Pradesh Team
Published : May 22, 2024, 9:43 AM IST
|Updated : May 22, 2024, 9:55 AM IST
LIVE : విశాఖలో టీడీపీ నేతల మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం - tdp leaders press meet
TDP Leader Ganta srinivas Live : మాజీ మంత్రి, భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ గంటా శ్రీనివాసరావు వారి నివాసంలో ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైనది. గంటా శ్రీనివాసరావు ఈ సమావేశంలో మాజీ ఎంపీ, ఉండి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ రఘురామ కృష్ణంరాజు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహా పలువురు పాల్గొమన్నారు. రాష్ట్రంలో అమలు చేసే ఉమ్మడి మేనిఫెస్టోతోపాటు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు భీమిలి తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గ మేనిఫెస్టో ప్రకారం అభివృద్ధి చేస్తానని ఆయన వివరించారు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అందరూ జగన్ పాలనపై విసిగిపోయారని గంటా పేర్కొన్నారు. భీమిలి నియోజకవర్గంలో అయితే ఇది మరీ స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. జగన్ పాలనకు విసుగుపోయిన నేతలు గ్రామాలకు గ్రామాలు వైసీపీ నుంచి తెలుగుదేశం వైపు మారారని గంటా వివరించారు.
Last Updated : May 22, 2024, 9:55 AM IST