LIVE : నదుల అనుసంధానంపై టాస్క్ఫోర్స్ ఛైర్మన్ శ్రీరామ్ మీడియా సమావేశం - Task Force Chairman Shri Ram Live
Published : Feb 29, 2024, 3:43 PM IST
|Updated : Feb 29, 2024, 4:48 PM IST
Task Force Chairman Shri Ram Live : నదుల అనుసంధానంపై టాస్క్ఫోర్స్ ఛైర్మన్ శ్రీరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ ఘటన తర్వాత కేంద్రం అడిగిన వివరాలు అధికారులు ఇవ్వలేదని తెలిపారు. ఎన్డీఎస్ఏకు సమాచారం ఇవ్వాలని చట్టం కూడా ఉందని టాస్క్ఫోర్స్ ఛైర్మన్ శ్రీరామ్ చెప్పారు. ఇప్పటి ప్రభుత్వం కూడా మేడిగడ్డ వివరాలు ఇవ్వట్లేదని అన్నారు. నాలుగు నెలలు తర్వాత రాహుల్ బొజ్జా ఎన్డీఎస్ఏకు లేఖ రాశారని వివరించారు. ఇప్పటికైనా ఎన్డీఎస్ఏ బృందానికి సమాచారం ఇచ్చి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.రాష్ట్రం సమాచారం ఇస్తేనే ఎన్డీఎస్ఏ విచారణ చేయగలుగుతుందని తెలిపారు. మేడిగడ్డ కట్టేటప్పుడు జియోలాజికల్ సర్వే వారి సహాయం తీసుకుని ఉండాల్సిందని వివరించారు. జియో లాజికల్ సర్వే చేయకుండా ప్రాజెక్టు కట్టడం అతిపెద్ద తప్పుని అన్నారు. థర్డ్ పార్టీ నాణ్యత తనిఖీలు చేయడం చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం వివిధ స్థాయిల్లో కంప్లిషన్ రిపోర్టులు ఇవ్వాలన్నారు. మొత్తం ప్రాజెక్టుకు ఒకేసారి కంప్లీషన్ రిపోర్టు ఇచ్చారని వివరణ ఇచ్చారు.
Last Updated : Feb 29, 2024, 4:48 PM IST