ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎస్​ఈసీ - నోడల్​ అధికారులకు సాంకేతిక శిక్షణ - నోడల్​ అధికారులకు సాంకేతిక శిక్షణ

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2024, 10:37 PM IST

SEC Training for Nodal Officers: రాష్ట్రంలో రానున్న ఎన్నికల కోసం రాష్ట్రంలో ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు సాంకేతిక శిక్షణను అందిస్తోంది. అందులో భాగంగా ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మెషిన్లలో (EVM) తలెత్తే సమస్యల్లో స్వల్పకాలిక మరమ్మతులపై నోడల్​ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఎస్​ఈసీ ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయ సీఈవో హరేంధిర ప్రసాద్, ఈసీఐఎల్ సాంకేతిక విభాగ ఉన్నాతాధికారులు పాల్గొని శిక్షణ అందించారు.

రాష్ట్రంలోని నోడల్​ అధికారులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. వర్చువల్​ పద్ధతిలో బీహార్​, గోవా, లద్దాఖ్​, లక్షద్వీప్, పుదుచ్చేరి, చండీఘడ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా హాజరయ్యారు. ఎలక్షన్ మేనేజ్​మెంట్​ సిస్టంలో భాగంగా ఈ శిక్షణను నిర్వహించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొదటి స్థాయి తనిఖీతో​ పాటు ఈవీఎం యంత్రాల రాండమైజేషన్, సాంకేతిక ఇబ్బందులు ఎదురైనప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేసే విధానంపై శిక్షణ ఇచ్చారు. పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో నిర్వహించాల్సిన విధానంపై అధికారులందరికీ ఈసీఐఎల్ శిక్షణ అందించింది.  

ABOUT THE AUTHOR

...view details