ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా అంతిమయాత్ర

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Updated : 8 minutes ago

Ratan Naval Tata Passes Way Live : దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తను టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ధ్రువీకరించారు. మహారాష్ట్ర కోల్బాలోని నివాసానికి రతన్‌ టాటా పార్థివదేహం తరలించారు. తరువాత ఎన్‌సీపీఏ లాన్​కు తీసుకువెళ్లారు. పలువురు ప్రజాప్రతినిధులు అక్కడకు చేరుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ప్రజలు నివాళులు అర్పించడానికి అక్కడ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్‌ టాటా అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. రతన్‌ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాయంత్రం రతన్‌ టాటా పార్థివదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. అంతిమ యాత్రలో కేంద్రమంత్రి అమిత్​ షా పాల్గొంటారు. కాగా ఆయన మృతి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం సంతాప దినం ప్రకటించింది.  
Last Updated : 8 minutes ago

ABOUT THE AUTHOR

...view details