బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండపై కడపలో ఆందోళన - Protest on Violence Against Hindus - PROTEST ON VIOLENCE AGAINST HINDUS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 18, 2024, 7:48 PM IST
Protest on Violence Against Hindus in Bangladesh: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండపై కడపలో హిందువులు కదం తొక్కారు. హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కడపలో హిందూ చైతన్య వేదికతో పాటు పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్జీవో కాలనీలోని వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ప్రారంభమై 7 రోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. నగరపుర వీధుల్లో తిరుగుతూ హిందువులపై దాడులను ఖండించారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 7 రోడ్ల కూడలి వద్ద మానవహారం చేపట్టారు.
బంగ్లాదేశ్లో హిందువులనే లక్ష్యంగా ఎంచుకొని అక్కడ ఉన్న స్థానికులు దౌర్జన్యాలకు హత్యలకు, అత్యాచారాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. బంగ్లాదేశ్లో ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణకాండను తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ముస్లిం దేశాలలో హిందువులను లేకుండా చేయాలని లక్ష్యంతో ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. అవసరమైతే తాము కూడా పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతామని హెచ్చరించారు.