ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE: ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌ - ప్రత్యక్ష ప్రసారం - PM MODI MANN KI BAAT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 11:03 AM IST

Updated : Jun 30, 2024, 11:32 AM IST

PM Modi Mann ki Baat Live : ప్రతి నెలా చివరి ఆదివారం ఉదయం కాగానే గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్‌ కీ బాత్‌. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరిపి తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం ఇది. టీవీ ప్రపంచం ముందు రేడియో వెలవెలబోతున్న తరుణంలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఆకాశవాణిని ఎంచుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు. 2014 అక్టోబర్‌ 3న విజయదశమి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారభించారు. ప్రతి నెలా చివరి ఆదివారం రోజున ఈ కార్యక్రమం ద్వారా ప్రజలనుద్దేశించి మోదీ తన మనసులోని మాటలను పంచుకుంటున్నారు. ఫిబ్రవరిలో చివరిసారిగా 110వ సారి మన్‌ కీ బాత్‌లో ప్రధాని పాల్గొని దేశం ఎన్నో ఘనతలు సాధించిందని గుర్తు చేశారు. తాజాగా నేడు ఏర్పాటు చేసిన మన్‌ కీ బాత్ 11వ ఎపిసోడ్​లో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఇన్నాళ్లు మన్​ కీ బాత్​ కార్యక్రమం వాయిదాపడింది. తాజాగా నేడు నరేంద్ర మోదీ మన్ కీ బాత్​తో మరో మారు తన అభిప్రాయాల్ని వెల్లడించనున్నారు.
Last Updated : Jun 30, 2024, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details