ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బర్త్‌డే పార్టీలో డ్రగ్స్‌ కలకలం - నలుగురు యువకులు అరెస్ట్

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Drugs at Birthday Party in East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలో డ్రగ్స్‌ దొరకడం కలకలం రేపింది. రాజానగరం మండలం భూపాలపట్నంలోని ఓ గెస్ట్ హౌస్​లో కొందరు యువకులు బర్త్ డే పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో నలుగురు యువకులు ఓ ఆన్ లైన్ యాప్ ద్వారా డ్రగ్స్ బుకింగ్ చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేపట్టగా ఓ కారులో నాలుగు గ్రాముల కొకైన్, మరో 50 గ్రాములు గంజాయి బయటపడింది. ఈ కేసులో దేవాబత్తుల దినేష్, వేమన విక్రం రాదా గగన్, బలం అజయ్, దువ్వనబోయిన పుష్పరాజ్​లను అరెస్టు చేశారు. మరో నిందితుడు పవన్ కుమార్ పరారీలో ఉన్నాడు. 

మత్తు పదార్థాలు కలిగి ఉన్న ఒక కారును సీజ్ చేశారు. అయితే వీరికి డ్రగ్స్‌ ఎలా వచ్చాయి? ఈ యువకులే డ్రగ్స్‌ కొనుగోలు చేసి సేవిస్తున్నారా? లేదా ఎవరికైనా సప్లై చేస్తున్నారా? అసలు డ్రగ్స్‌ రాకెట్‌ వెనక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్​ను అరికట్టేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్‌ పెట్టింది. డ్రగ్స్‌ వాడకం, సరఫరాను తీవ్రంగా పరిగణిస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలు కొరియర్ ద్వారా ఎలాంటి ఆర్డర్లు పెడుతున్నారో నిఘా పెట్టాలని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details