By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 27, 2024, 1:11 PM IST
రోడ్డు ప్రమాదమా? హత్యా?- బైక్పై వెళ్తున్న వ్యక్తి అనుమానాస్పద మృతి - person died suspiciously Nandyala
Person Died Suspiciously in Nandyala District : నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం చెరువు సమీపంలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి పరారయినట్లు డోన్ DSP శ్రీనివాస్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
suspicious Murder Near Venkataouram cheruvu : ఈరోజు (శనివారం) ఉదయం ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి వెనక్కి వాలి పడి ఉన్నాడని మృతుని తలకు ముందు భాగంలో గాయమైందని, కడుపులో కత్తి పోటు మాదిరిగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. బైక్ ముందు భాగం పూర్తిగా దెబ్బతిందని పేర్కొన్నారు. మృతుడి వివరాలు కూడా తెలియలేదని వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు డిఏస్పీ తెలిపారు. బైక్కు కిరాణా దుకాణంకు సంబంధించిన రెండు సంచులు ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.