LIVE : దిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత న్యాయవాది మోహిత్ రావు - MLC Kavitha Lawyer Press Meet - MLC KAVITHA LAWYER PRESS MEET
Published : May 28, 2024, 7:42 PM IST
|Updated : May 28, 2024, 9:32 PM IST
MLC Kavitha Lawyer Press Meet : దిల్లీ మద్యం కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో ఈడీ, సీబీఐ వాదనలు విన్న హైకోర్టు జడ్జి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు రిజర్వ్ చేశారు. అయితే ఈడీ ఈ కేసు విషయంలో సంచలన విషయాలను బయటపెట్టింది. మద్యం వ్యాపారం గురించి కేసీఆర్కు కవిత ముందే వివరాలు చెప్పారని తెలిపింది. ఎమ్మెల్సీ కవిత తన టీమ్ను దిల్లీలో కేసీఆర్కు పరిచయం చేశారని చెప్పారు. దిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే కవిత వారిని పరిచయం చేశారని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.కవిత పరిచయం చేసిన వారి నుంచి కేసీఆర్ వివరాలు తెలుసుకున్నారని ఈడీ చెప్పింది. మద్యం వ్యాపారం వివరాలను సమీర్ను అడిగి కేసీఆర్ తెలుసుకున్నారన్నారు. కవిత రెండేళ్లలో సుమారు 11 మొబైల్ ఫోన్లు వాడారంది. నాలుగు ఫోన్లలో ఉన్న ఆధారాలను కవిత ధ్వంసం చేశారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. అయితే ఇప్పుడు కవిత తరఫు న్యాయవాది మీడియాతో ఈ కేసులో వివరాలను వెల్లడించారు.
Last Updated : May 28, 2024, 9:32 PM IST