ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 9:37 PM IST

ETV Bharat / videos

విశాఖలో రోడ్డు ప్రమాదం - మానవత్వం చాటుకున్న టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు - MLA Palla Helped Injured Person

MLA Palla Srinivasa Rao Helped Injured Person in Road Accident: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గాయాలైన బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే షీలానగర్ నుంచి గాజువాక వైపు వెళ్తున్న లారీకి అతివేగంగా ద్విచక్రవాహనం అడ్డుగా రావడంతో ఒక్కసారిగా లారీ ఆగింది. దీంతో అనుకోకుండా వెనక వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వెనక లారీ క్యాబిన్ మొత్తం ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో క్యాబిన్​లో ఇరుక్కున్న డ్రైవర్​ను గాజువాక నుంచి విశాఖ వైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దగ్గరుండి ప్రమాదంలో ఇరుక్కున్న డ్రైవర్​ను బయటకు తీసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. డ్రైవర్​కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సాయంతో డ్రైవర్​ని దగ్గర్లోని హాస్పిటల్​కు తరలించారు. పల్లా శ్రీనివాసరావు స్పందించి దగ్గరే ఉండి అన్ని పనులు చూసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details