ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రభుత్వానికి భారమైనా వెయ్యి రూపాయల పింఛన్ పెంచాం: మంత్రి కందుల - Pension Distribution on July 1st

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 30, 2024, 3:01 PM IST

Kandula Durgesh About Pension Distribution : ఎన్నికల హామీ మేరకు ఒకేసారి వెయ్యి రూపాయలు పింఛను పెంపుతో రేపటి నుంచి పింఛన్లు అందిస్తున్నట్లు  రాష్ట్ర పర్యాటక శాఖ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పాత బకాయిలు 3 వేలు కలిపి మొత్తం 7 వేలు ఇస్తున్న విషయం గుర్తు చేశారు. గత ప్రభుత్వానికి మించి సంక్షేమం అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.

Pension Distribution on July 1st : పోలవరం ప్రాజెక్టును కనీసం కూడా అభివృద్ధి చేయకపోవడం వల్లే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించారని కందుల దుర్గేష్ తెలిపారు. ఐదేళ్లుగా అభివృద్ధి జాడ లేకుండా చేశారని, గత తప్పిదాలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుందని ఆయన అన్నారు. పర్యాటకంగా రాష్ట్రన్ని ముందుకు నడిపిస్తామని వెల్లడించారు. పాపికొండల విహారయాత్ర ప్రారంభమైందని, గత సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి రక్షణ చర్యలు తీసుకునేందుకు స్వయంగా పరిశీలించనున్నట్లు మంత్రి తెలిపారు. పర్యాటకులతో కూడా మాట్లాడి అవసరమైన సదుపాయాలు కల్పించడానికి ఉన్న సదుపాయాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details