తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 11:02 AM IST

Updated : May 8, 2024, 12:27 PM IST

ETV Bharat / videos

LIVE : లోక్​సభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం

Lok Sabha Session Live 2024 : లోక్​సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం రోజున జరిగిన సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన మోదీ, విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చాలా కాలం విపక్షాలు ప్రతిపక్ష హోదాలోనే ఉంటాయని, వాటి దుస్థితికి కాంగ్రెస్​ కారణమని ఎద్దేవా చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లలో, ఎన్​డీఏ 400లకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి లోక్​సభలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్​డీఏ మూడో టర్మ్​లో అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంటామని మోదీ స్పష్టం చేశారు. వెయ్యేళ్లకు అవసరమైన బలమైన పునాది వేస్తామని చెప్పుకొచ్చారు. విపక్షాలు చాలాకాలం ప్రతిపక్షంలోనే ఉండాలని సంకల్పం తీసుకున్నాయని ఎద్దేవా చేశారు. దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందున మళ్లీ దశాబ్దాల పాటు విపక్షంలో ఉండాలని వారు భావిస్తున్నారని అన్నారు. విపక్షాల కోరికను భగవంతుడు నెరవేరుస్తారని తాను భావిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి సమావేశాల ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.

Last Updated : May 8, 2024, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details