"అదిగో చిరుత" రామప్ప కొండపై సంచారం - మూడు రోజులుగా భయం గుప్పిట గ్రామస్థులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : 4 hours ago
Leopard Roaming in Anantapur District : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పంటపొలాల్లో, ఇళ్లలో ప్రతీ ప్రదేశంలో ఏదో ఒక సమయంలో చిరుత ఆనవాళ్లు స్థానికులకు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం జరుట్లరాంపురంలో చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న రామప్ప కొండపై చిరుతను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మూడు రోజులుగా గ్రామ శివారులో చిరుత సంచరిస్తోందన్న స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకో లేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు.
ఇంతకు ముందు తరచూ ఎలుగుబంటి సంచారంతో పలు ఇబ్బందులు ఎదుర్కున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. ఒంటరిగా పొలం పనులకు వెళ్లాలన్నా వణికిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిగా ఎవ్వరూ బయటకు వెళ్లొద్దని, రాత్రిపూట మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని తెలిపారు.