ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అరుదైన దృశ్యం - పంట పొలాల్లో వందలాది రామచిలుకలు - hundreds of Parrots in corn fields - HUNDREDS OF PARROTS IN CORN FIELDS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 7:51 PM IST

Hundreds of Parrots are Spinning in Corn Fields at Krishna District : ఒకప్పుడు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపించే రామచిలుకలు ప్రస్తుతం కనుమరుగైపోయాయి. ఎప్పుడో ఒకసారి కనిపిస్తే చాలు వాటిని చూసి మురిసిపోయి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం. అలాంటిది ఒక్కచోటే వందలాది రామచిలుకలు కనిపిస్తే ఆ అనుభూతి వేరే లెవెల్​​లో ఉంటుంది కదూ. ఇలాంటి అరుదైన దృశ్యమే కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో గత నెలరోజులుగా వర్షాలు కురవకపోవడంతో మొక్కజొన్న కండెలు కోనే నాథుడే కరువయ్యాడు. ఒక్కో ఎకరాకు సుమారు రూ.40 వేల వరకు రైతులు పెట్టుబడిగా పెట్టారు. 

కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం ఒక్కో ఎకరం రూ.10 వేలకు కూడా కొనడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంటను పొలంలో అలాగే వదిలివేశారు. మరికొందరు రైతులు ట్రాక్టర్ సాయంతో దున్నించి వేశారు. దీంతో పొలంలో పడిఉన్న మొక్కజొన్న కండెలను తినడానికి వందలాది రామచిలుకలు ఉదయం, సాయంత్రం సమయంలో సందడి చేస్తూ చూపరులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇన్ని రామచిలుకలు ఒక్కచోట చూడటం చాలా ఆనందంగా ఉందని అక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పొలంలో మొక్కజొన్న గింజలు తింటూ ప్రక్కనే తాటి చెట్లు, మామిడి చెట్లపై వాలుతూ వందలాది రామచిలుకలు ఒక్కసారిగా ఎగురుతూ చూపరులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details