"వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు" - ఎన్నికల్లో పోటీ చేయనున్న హిజ్రాల సంఘం నాయకురాలు - Hijra community leader on Jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 16, 2024, 5:20 PM IST
Hijra Community Leader Will Contest the Elections 2024 : సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులు, హిజ్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని జరిగిందని హిజ్రాల సంఘం నాయకురాలు అడ్డాకుల గీతారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేకు అల్లాడిపోతున్నారని అన్నారు. హిజ్రాలు డీగ్రీలు, పీజీలు చేసిన ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు. హిజ్రాల, గిరిజనులు అభివృద్ధి పోరాటం చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే,
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజనులు, హిజ్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని హిజ్రాల అడ్డాకుల గీతారాణి తెలిపారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో రానున్న ఎన్నికల్లో పోటీకి కార్యాచరణ ప్రణాళికను గిరిజన సంఘం నాయకులు, హిజ్రాలతో చర్చించారు. కురుపాం నియోజకవర్గ పరిధిలోని అభివృద్ధి ఎక్కడ జరగలేదని, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆదివాసీ యువత భవిష్యత్తు లేకుండా పోయిందని ఆరోపించారు. ఉద్యోగాలు లేక నియోజకవర్గంలో ఆదివాసీ యువత పడుతున్న కష్టాలను గుర్తించానని తెలిపారు. అవకాశం వస్తే రాజకీయ పార్టీల తరఫున, లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పషం చేశారు.