ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోటెత్తిన గోదావరి- పోలవరం నుంచి భారీగా నీటి విడుదల - GODAVARI FLOOD

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 19, 2024, 12:34 PM IST

godavari_flood_at_polavaram_project (ETV Bharat)

Godavari Flood at Polavaram Project : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద పోటెత్తింది. జలాశయం వద్ద వరద ఉద్ధృతి క్రమేపీ పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్ ఎగువ నీటిమట్టం 29 మీటర్లు కాగా స్పిల్ వే దిగువ 19 మీటర్లకు చేరింది. అదేవిధంగా ఎగువ కాఫర్‌ డ్యాం నీటిమట్టం 29 మీటర్లు దిగువ కాఫర్‌ డ్యాం నీటిమట్టం 18 మీటర్లకు చేరింది. ఈ క్రమంలో మూడున్నర లక్షల క్యూసెక్కుల జలాలను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.

గురువారం ఉదయం 7 గంటల వరకూ ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడులలో కురిసిన వర్షపాతం 39.2 మి.మీ. మాత్రమే. ఆ తర్వాతి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 395.2 మి.మీ. కురిసింది. వాగులు, వంకలు పొంగాయి. కుక్కునూరు మండలంలో పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. గుండేటి వాగు ఉద్ధృతికి వంతెన అప్రోచ్‌ కొట్టుకుపోయింది. దిగువ గ్రామాలతో పాటు వేలేరుపాడు మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details