ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 16, 2024, 3:51 PM IST

ETV Bharat / videos

రూ. 10 లక్షల కోట్ల అప్పులో ఏ జిల్లాకి ఎంత ఖర్చు పెట్టారో జగన్ చెప్పాలి: చింతా మోహన్ - Chinta Mohan on YS Jagan

Former Union Minister Chinta Mohan on the YS Jagan: జగన్ పరిపాలన కంటే చంద్రబాబు పరిపాలన బాగుందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ చెప్పారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుని అభినందిస్తున్నానని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ని రెండు కుటుంబాలు విభజించాయని, తెలంగాణలో ఒక కుటుంబం, ఆంధ్రప్రదేశ్​లో మరో కుటుంబం పదేళ్ల పాటూ పాలించి వేల కోట్లు దోచుకున్నాయని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, వైఎస్ జగన్​పై చింతా మోహన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కుటుంబాల వల్ల రెండు రాష్ట్రాలు దిల్లీలో అప్పులు అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ప్రదేశ్​గా మారిపోయిందని జగన్ చేసిన 10 లక్షల కోట్ల అప్పులో ఏ జిల్లాకి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో దళితులకు అన్యాయం జరుగుతుందని, బీజేపీతో పాటూ కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి దళితుల్ని విభజించి పాలించాలని చూస్తున్నాయని మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details