ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిలిచిన కుళాయి నీటి సరఫరా- పొలాలు, కుంటల్లోని వర్షపు నీరే దిక్కు - Drinking Water Scarcity Anantapur

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 5:26 PM IST

నిలిచిన కుళాయి నీటి సరఫరా- పొలాల కుంటల్లోని వర్షపు నీరే దిక్కు (ETV Bharat)

Drinking Water Scarcity In Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో తాగునీటి సమస్య జఠిలంగా మారింది. కొన్ని నెలలుగా ఆ గ్రామంలోని కుళాయిల్లో నీరు సరఫరా కాకపోవటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ నీటి వనరులు లేకపోవటంతో ఇటీవల కురిసిన వర్షాలకు కుంటలో చేరిన నీటిని వినియోగిస్తున్నారు. సుమారు రెండున్నర కిలోమీటర్లు దూరం వెళ్లి తోపుడు బండ్లు, ఆటో, వాహనాల సాయంతో బిందెళ్లో వర్షపు నీరు తెచ్చుకుని తాగుతున్నారు. 

అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి (Drinking Water) సమస్య తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. వర్షాకాలం మొదలైనా గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. నెలల తరబడి నీటి సరఫరా నిలిచిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details