LIVE : నాగర్కర్నూల్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం - CM Revanth Election Campaign - CM REVANTH ELECTION CAMPAIGN
Published : Apr 23, 2024, 7:15 PM IST
|Updated : Apr 23, 2024, 7:42 PM IST
CM Revanth Election Campaign In Nagarkurnool LIVE : నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు అందరు పాల్గొన్నారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. వచ్చే వరి పంటకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన పంచ్ న్యాయ్ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 26వ తేదీ వరకు లోకసభ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటన చేస్తారు. ఉదయం కొడంగల్ ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి నాగర్కర్నూల్ సభలో ప్రసంగిస్తున్నారు. 24న సికింద్రాబాద్, వరంగల్లో పర్యటిస్తారు. 25న చేవెళ్ల, 26న జహీరాబాద్ ప్రచారసభల్లో పాల్గొంటారు.
Last Updated : Apr 23, 2024, 7:42 PM IST