తెలంగాణ

telangana

ETV Bharat / videos

దేశంలో మూడోసారీ ప్రధాని మోదీనే - భువనగిరిలో గెలుపు నాదే! : బూర నర్సయ్య గౌడ్ - lok sabha Elections 2024

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 12:46 PM IST

BJP MP Candidate Boora Narsaiah Goud Meets Walkers : దేశంలో నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ జోస్యం చెప్పారు. ఈరోజు ఉదయం భువనగిరి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, చెరువు కట్ట వద్ద మార్నింగ్​ వాకర్స్​తో ఆయన మాట్లాడారు. తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని బూర నర్సయ్య గౌడ్​ మార్నింగ్ వాకర్స్​ను కోరారు. ఈ సందర్భంగా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు .    

గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తన పార్లమెంట్​ నియోజక వర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని వాకర్స్​కు బూర నర్సయ్య గౌడ్ గుర్తు చేశారు. బీబీ నగర్ ఎయిమ్స్​, కేంద్రీయ విద్యాలయం, పాస్​పోర్ట్ కేంద్రం తాను ఎంపీగా ఉన్నప్పుడే తీసుకువచ్చినట్లు వాకర్స్​కు వివరించారు. మరోసారి తనకు ఎంపీగా అవకాశం కల్పించాలని కోరారు. ఈ సారి తనను ఎంపీగా గెలిపిస్తే జిల్లాకు ఐటీ పరిశ్రమలు తీసుకువస్తానని తెలిపారు. రూ.20 వేల కోట్లతో మరిన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.          

ABOUT THE AUTHOR

...view details