LIVE: కొలకలూరు రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ షర్మిల - ప్రత్యక్ష ప్రసారం - APCC Chief YS Sharmila Live
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 12:14 PM IST
|Updated : Feb 8, 2024, 1:11 PM IST
APCC Chief YS Sharmila Live: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. అవకాశం దొరికితే చాలు ముఖ్యమంత్రి చేసిన అక్రమాలు, అవినీతిని ప్రజల్లో ఎండగడుతున్నారు. తాజాగా బాపట్లలో షర్మిల సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల్ని జగన్ మోసం చేశారంటూ నిప్పులు చెరిగారు. నాలుగున్నరేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని సీఎం జగన్ ఎన్నికల ముందు సిద్ధమంటున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. బాపట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న షర్మిల జగన్ దేనికి సిద్ధమో చెప్పాలంటూ వాగ్బాణాలు సంధించారు.
8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేయడానికా, పూర్తి మద్యపాన నిషేధమని చెప్పి మోసం చేయడానికా అని నిలదీశారు. కాగా ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో షర్మిల పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొలకలూరు రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొని ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. భూయాజమాన్య హక్కు చట్టం 2023 రద్దుకు షర్మిలకు న్యాయవాదులు వినతిపత్రం అందజేశారు.