ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పింఛనర్లంతా ఒక్కటవుదాం-వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపుదాం: ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ - Andhra Pensioners Party Meet - ANDHRA PENSIONERS PARTY MEET

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 21, 2024, 3:30 PM IST

Andhra Pensioners Party Meet: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లందరూ నిరాశ, నిస్పృహలో ఉన్నారని ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పెన్షనర్లు నానావస్థలు పడుతున్నారని మండిపడ్డారు. పింఛన్‌ ఒకటో తేదీ కాకుండా 20వ తేదీకి ఇస్తున్నారని జగన్ సర్కారుపై ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోకపోతే చాలా నష్టపోతామని పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు పింఛనర్లంతా ఒక్కటవుదామని ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. 

"రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లందరు నిరాశలో ఉన్నారు. పింఛన్‌ ఒకటో తేదీ కాకుండా 20వ తేదీకి ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోకపోతే చాలా నష్టపోతాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు పింఛనర్లంతా ఒక్కటవుదాం." - ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ ప్రతినిధులు

ABOUT THE AUTHOR

...view details