Concerns Of Peddireddy Land Grab Victims in Tirupathi:కోట్ల రూపాయల విలువైన తమ స్థలాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారని బాధితులు ఆందోళనకు దిగారు. ఆక్రమణకు గురైన స్ధలం వద్ద బాధితులు చేరుకుని నిరసనకు దిగారు. తమకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని వారు వెల్లడించారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి శివారులోని చెన్నాయిగుంటలో తమ భూమిని ఆక్రమించుకున్నారని స్థానికులు ఆరోపించారు. తరచూ తమకు బెదిరింపులతో కూడిన ఫోన్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 30 కోట్ల రూపాయల విలువైన భూములను ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు తెలిపారు. బాధితులంతా ఏకమై ముక్తకంఠంతో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భూ ఆక్రమణలపై గత కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్నామని ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు ఆదేశాలు ఉన్నా పెద్దిరెడ్డి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. తమ వద్ద పత్రాలు అన్ని ఉన్నా పెద్దిరెడ్డి అనుచరులు ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారన్నారని వెల్లిబుచ్చారు. కూటమి ప్రభుత్వం దీనిపై సకాలంలో స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులంతా విజ్ఞప్తి చేశారు.
''భూ ఆక్రమణలపై గత కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా సరే పెద్దిరెడ్డి ఇక్కడ అక్రమంగా నిర్మాణాలను చేస్తున్నారు. మా వద్ద పత్రాలు అన్ని ఉన్నా సరే పెద్దిరెడ్డి అనుచరులు ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై సకాలంలో స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాం''-బాధితులు