ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 9:33 PM IST

ETV Bharat / state

టీవీ యాంకర్‌పై మోజు - పెళ్లాడాలంటూ ఏకంగా కిడ్నాప్ చేయించిన యువతి

TV Anchor Pranav Kidnap Case Woman Arrest : ఓ యువతి ఓ టీవీ యాంకర్​పై మనసుపడింది. ఆయనతో చాట్ చేసింది. ఆతడినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. అయితే అందుకు ఆ వ్యక్తి ఒప్పుకోకపోవడంతో ఏకంగా కిడ్నాప్ చేయించింది. సినిమా ట్విస్టులా ఉన్న ఈ ఘటన హైదరాబాద్​ ఉప్పల్​లో జరిగింది. ఈ కేసులో తృష్ణ అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

TV_Anchor_Pranav_Kidnap_Case_Woman_Arrest
TV_Anchor_Pranav_Kidnap_Case_Woman_Arrest

టీవీ యాంకర్‌పై మోజు - పెళ్లాడాలంటూ ఏకంగా కిడ్నాప్ చేయించిన యువతి

TV Anchor Pranav Kidnap Case Woman Arrest : ఓ టీవీ ఛానల్లో పనిచేస్తున్న ప్రణవ్​ను కిడ్నాప్ చేయించిన తృష్ణ అనే యువతిని ఉప్పల్​ పొలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్​లోని కేకేఆర్ నగర్​లో ఉంటున్న ప్రణవ్ ఈ నెల 10న సినిమా చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. మాదాపూర్​లోని తృష్ణ అనే యువతి వద్దకు తీసుకెళ్లారు.

భారత్ మాట్రిమోనిలో(Bharat Matrimony) ప్రణవ్ ఫొటోతో చైతన్య రెడ్డి అనే యువకుడు మూడు నెలల పాటు యువతితో చాటింగ్ చేశాడు. యువతి మాత్రం ప్రణవ్ తనతో చాటింగ్ చేస్తున్నట్లు భ్రమ పడింది. తనతో చాటింగ్ చేసి ముఖం చాటేశాడని అనుమానంతో ప్రణవ్​ను ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో అయిదుగురి వ్యక్తులతో అతణ్ని కిడ్నాప్​ చేయించింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని ప్రణవ్​ను ఒత్తిడి చేసింది. ఈనెల 11న ఉదయం ప్రణవ్​ను నిందితురాలు వదిలేసింది.

ఈ క్రమంలో కిడ్నాప్​నకు గురైన ప్రణవ్ ఉప్పల్​ పోలీసులను ఆశ్రయించి, ఆమెపై ఫిర్యాదు చేశాడు. నిందితురాలు తృష్ణ డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్​ను నడుపుతున్నట్లు మల్కాజిగిరి ఏసీపీ పురుషోత్తంరెడ్డి చెప్పారు. యువతి తృష్ణపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

'ప్రణవ్​ అనే వ్యక్తి సాఫ్ట్​వేర్​​ ఇంజినీర్​, ఓ ఛానల్​లో యాంకరింగ్​ కూడా చేస్తారు. ఈ నెల 11న ఆయన ఉప్పల్​ పోలీస్​ స్టేషన్​లో తృష్ణ అనే యువతిపై కంప్లైంట్ ఇచ్చారు. తృష్ణ అనే యువతి డిజిటల్ మార్కెటింగ్ చేస్తోంది. ఆమెకు మాట్రిమోనిలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మాట్రిమోని ద్వారా ప్రణవ్​ ఫొటోతో ఓ వ్యక్తి చాటింగ్​ చేశాడు. ప్రణవ్​ అని ఆమె అనుకున్నది. ఈ క్రమంలో ప్రణవ్​ను తృష్ణ ఫాలో అయింది. యువతి తృష్ణపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం'- పురుషోత్తంరెడ్డి, మల్కాజిగిరి ఏసీపీ

మూడు రోజుల శిశువును కిడ్నాప్ చేసిన మహిళ - వీడియో వైరల్

పిల్లల్ని ఎత్తుకెళ్తున్నాడనే అనుమానంతో దాడి - పశువుల కాపరి మృతి

ABOUT THE AUTHOR

...view details