Tribals Attacked Police in Khammam District : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోడు భూముల విషయంలో గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాని చేరుకొని వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే గిరిజనులు పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో సత్తుపల్లి సీఐ కిరణ్, మరో నలుగురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి.
పోలీసులపై గిరిజనుల దాడి- సీఐ, కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు - People Attack On Police - PEOPLE ATTACK ON POLICE
Tribals Attacked Police in Khammam District తెలంగాణ ఖమ్మం జిల్లాలో పోడు భూముల విషయంలో గిరిజను వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఘర్షణను అదుపు చేసేందుకు వెళ్లిన పోలీసులపై ఓ వర్గం గిరిజనులు దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి.
![పోలీసులపై గిరిజనుల దాడి- సీఐ, కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు - People Attack On Police Tribals_Attacked_Police_in_Khammam_District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/31-03-2024/1200-675-21114753-thumbnail-16x9-tribals-attacked-police-in-khammam-district.jpg)
Tribals_Attacked_Police_in_Khammam_District
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 31, 2024, 7:50 PM IST
గత కొంతకాలంగా చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలోని పోడు భూముల విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు బుగ్గపాడు, చంద్రయపాలెం గ్రామాలకు చెందిన గిరిజనుల మధ్య వాగ్వాదం జరగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లగానే గిరిజనులు దాడికి పాల్పడ్డారు.
ఖమ్మం జిల్లాలో గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం- అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై దాడి